కావలసినవి:
- మటన్ లేదా చికెన్-కిలో
- బియ్యం-కిలో
- నానబెట్టిన సెనగపప్పు-అర కప్పు
- పెరుగు-పావ్ కిలో
- ఉల్లిపాయలు-రెండు
- అల్లం వెల్లుల్లి-రెండు స్పూన్లు
- గరం మసాల-రెండు స్పూన్లు
- ఉప్పు-తగినంత
- నెయ్యి లేదా నూనె -సరిపడా
- బాణలిలో సరిపడా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేఇంచాలి.
- ఈ ముక్కలు చల్లరిపోయక పెస్ట్ల చేయాలి.
- ఇపుడు ఆ బాణలిలో చికెన్ ముక్కలు వేసి ఎర్రగా వేఇంచాలి.
- తరువాత పెరుగు గిలకొట్టి ఈ ముక్కల్లో వేసి,స్పూన్ అల్లం వెల్లుల్లో ముద్దా కూడా వేసి వేఇంచాలి.
- తగినన్ని నీళ్లు పోసి ,ఇది మెత్తబడేవరకు ఉడికించాలి.
- తరువాత దీనిలో సెనగపప్పు,ఉల్లిపాయ ముద్దా వేసి నీళ్లు ఇంకిపోయేవరకు సిమ్లో ఉంచాలి.
- నెయ్యి పైకి తేలాక స్పూన్ గరం మసాల వేయాలి.
- కూర వండే సమయమ్లోనే విడిగా అన్నం వండాలి. ముందుగ ఎసరు నీళ్లు మరిగిన తరువాత ఓ స్పూన్ అల్లంవెల్లుల్లి,ఉప్పు,అర స్పూన్ గరం మసాల వేసి బియ్యం వేసి అన్నం పొడిగా ఉండేలా వండాలి.
- ఇప్పుడు మిగిలిన గరం మసాల కూడా చల్లి,రెండు స్పూన్ల నెయ్యి లేదా నూనె వేయాలి.
No comments:
Post a Comment