మిల్క్ కేకు తయారుచేద్దాం..
- కావలసినవి:
- పాల పొడి-పావ్ కిలో
- పంచదార-200గ్రా.
- నెయ్యి-100గ్రా.
- మైదా-50గ్రా.
- యాలకుల పొడి- పావ్ స్పూన్
- నీళ్లు- తగినన్ని
- పంచదారలో తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టి పక్కన పెట్టాలి.
- మందపాటి కళాయి తీసుకుని అందులో సగం నెయ్యి పోసి సన్న సెగమీద దోరరంగు వచ్చేవరకు వేఇంచి, అందులోపాకం పోసి అట్లకాడతో కలుపుతూ సన్న సెగమీద ఉదికిస్తూనే మిగిలిన నెయ్యి వెయ్యాలి.
- అలాగే కలుపుతూ నెయ్యి పైకి తేలేవరకు ఉడికించి దించాలి.
- నెయ్యి రాసిన వెడల్పాటి పళ్ళెంలోకి వంపి సమంగా సర్ది రెండు నిమిషాల తరవాత చాకుతో కావలిసిన ఆకారంలోముల్లాలుగా కోయాలి.
- వీటి పైన అలంకారానికి జీడిపప్పు,బాదం పప్పు లేదా డ్రీ ఫ్రూట్స్ ఉపయోగించవచ్చు..
- దీనితో పసంద్య్న మిల్క్ కేకు రెడీ..
- బాగా ఆరిన తరువాత ముక్కలు విడదీసి డబ్బాలో సర్దితే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయ్..
No comments:
Post a Comment