కావలసినవి:
- మటన్- ముప్పావ్ కిలో
- బియ్యం- మూడు కప్పులు
- ఉల్లిపాయ- ఒకటి
- అల్లం- చిన్నముక్క
- వెల్లుల్లి రెబ్బలు- ఆరు
- షాజీర- స్పూన్
- ధనియాలు- స్పూన్
- మిరియాలు- స్పూన్
- లవంగాలు- ఆరు
- యాలకులు- రెండు
- దాల్చిన చెక్క- రెండు
- పలావ్ ఆకులు- రెండు
- నెయ్యి- రెండు స్పూన్స్
- ఉప్పు- తగినంత
- పాన్లో కడిగిన మాంసం ముక్కలు, బిర్యాని మసాలాలు, ఉప్పు, ఆరు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి.
- 20 నిమిషాల పాటు ఉడికించి తరవాత మాంసం ముక్కల్ని విడిగా తీసి ఆరబెట్టాలి.
- మసాలల్ని కూడా తీసి మెత్తగా మెదపాలి.
- మాంసంలోనుండి వచ్చిన నీళ్ళని పక్కన పెట్టాలి.
- ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేసి, ఉల్లిపాయ ముక్కలు వేఇంచాలి. తరువాత మసాలాలు, మాంసం అన్నీ వేసికొద్దిసేపు వేఇంచాలి.
- తరువాత పక్కకు తీసి ఉంచిన మాంసం నీళ్లు పోసి మరిగాక కడిగి ఉంచిన బియ్యం వేసి ఉడికించాలి.
దీన్ని పెరుగు చట్నీతో వడ్డిస్తే బాగుంటుంది..
No comments:
Post a Comment