కావలసినవి:
- భాసుమతి బియ్యం- కప్పు
- పాల కూర- 75 గ్రాములు
- ఉల్లిపాయ- ఒకటి
- అల్లం- చిన్న ముక్క
- వెల్లుల్లి-6 రేకులు
- మంచి నీళ్లు- అర లీటర్
- నూనె- ఒకటిన్నర స్పూన్
- జీడి పప్పు- 10
- పచ్చి మిర్చి- 2
- గరం మసాల- అర స్పూన్
- యాలకుల పొడి- అర స్పూన్
- లవంగాల పొడి- చిటికెడు
- ఉప్పు- తగినంత
- నిమ్మరసం- ఒక స్పూన్
- టమాట- ఒకటి
- పాల కూర, ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. కొద్దిగా నీళ్లు కూడా వేయాలి.
- ఓ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. జీడిపప్పు, బియ్యం వేసి రెండు నిమిషాలు వేఇంచాలి.
- పచ్చి మిర్చి, గరం మసాల, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడులు, ఉప్పు వేసి బాగా కలపాలి.
- సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంట మిద ఉడికించాలి.
- తరువాత మెత్తగా రుబ్బి పెట్టుకున్న పాల కూర పేస్టు కూడా వేసి మరో పది నిమిషాలు సిమ్లో ఉంచాలి.
- చివరగా నిమ్మ రసం పిండి ఓ సారి కలిపితే పాలక్ పలావ్ రెడీ....
No comments:
Post a Comment